పవన్ కళ్యాణ్పై కేసీఆర్ కామెంట్స్ : కోర్టు 15 రోజుల గడువు!
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలపై కోర్టు స్పందించింది. ఈ కేసులో విచారణను 15 రోజుల్లో పూర్తి చేయాలంటూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అనంతపురం న్యాయస్థానం ఆదేశించింది. పవన్పైన కేసీఆర్ అనుచిత వ్యాఖ్యల కేసులో పక్షం రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని అనంతపురం టూటౌన్ పోలీసులను ఆదేశించింది.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు బుధవారం తమ తుది నివేదికను సమర్పించవలసి ఉంది. అయితే, తమకు మరికొంత సమయం కావాలని పోలీసులు కోర్టును కోరారు. దీంతో కేసు నమోదు చేసిన న్యాయవాది మురళీ కృష్ణ వాదనను కోర్టు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి కేసీఆర్ పైన పలు సెక్షన్ల కింద నమోదయింది.