శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 31 మే 2016 (12:11 IST)

ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో కొనుగోళ్ల ఉద్దేశంతోనే నాలుగో అభ్యర్థి : నారాయణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్న ఉద్దేశంతోనే నాలుగో అభ్యర్థిని టీడీపీ బరిలోకి దించాలని భావిస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ అన్నారు. ఇదే అశంపై ఆయన మాట్లాడుతూ రాజ్యసభ బరిలో టీడీపీ నాలుగో అభ్యర్థిని నిలబెట్టడంపై ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. 
 
మళ్లీ డబ్బులు పెట్టి కొనుగోలు చేసే ఉద్దేశంతోనే నాలుగో అభ్యర్థిని బరిలోకి దింపుతున్నారంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రాజ్యసభ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులను కొనసాగించే క్రమంలో ఉన్నారన్నారు. కేసీఆర్‌కు తగిన బలం ఉన్నా ఫిరాయింపులను ప్రోత్సహించారని, అలాగే చంద్రబాబూ పోటీపడి కొనుగోలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేసే దుర్బుద్ధి ఇదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
కానీ ప్రజలు ప్రతిపక్షమేనన్నారు. బహిరంగంగా ఫిరాయింపు నిరోధక చట్టాలను ఉల్లంఘిస్తున్నారని చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుపై కత్తి వేలాడుతోందని, మళ్లీ అదే తప్పు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక ఆయన బాగుపడేదిలేదన్నారు. రాజకీయ వ్యూహానికి, వ్యభిచారానికి తేడా ఉందన్నారు. వ్యభిచారం అంటే బతుకు కోసం చేశామంటారన్నారు.