గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (11:04 IST)

అనంతపురంలో కేసీఆర్ పర్యటన: మళ్లీ ఇద్దరు చంద్రులూ కలుస్తారా?

ఇద్దరు చంద్రులు మళ్లీ కలవనున్నారు. అవును.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అనంతపురం జిల్లా పర్యటన ఖరారైంది. ఇదే జరిగితే ఏపీ సీఎం చంద్రబాబు, టి. సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఏర్పడుతుంది. అయితే, వీ

ఇద్దరు చంద్రులు మళ్లీ కలవనున్నారు. అవును.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అనంతపురం జిల్లా పర్యటన ఖరారైంది. ఇదే జరిగితే  ఏపీ సీఎం చంద్రబాబు, టి. సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఏర్పడుతుంది. అయితే, వీరిద్దరి మధ్యా ఎటువంటి అధికారిక చర్చలూ ఉండవని సమాచారం. అక్టోబర్ 1వ తేదీన దివంగత పరిటాల రవి, సునీతల కుమారుడు వివాహం వెంకటాపురంలో జరుగనుంది. 
 
ఈ  వివాహానికి కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ అనంత పర్యటన ఖరారైనట్టు సీఎం క్యాంపు కార్యాలయం వర్గాలు స్పష్టం చేశాయి. ఆదివారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి విమానంలో చేరుకునే కేసీఆర్, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వెంకటాపురం వెళతారు. శ్రీరామ్ దంపతులను ఆశీర్వదిస్తారు. 
 
ఈ వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. దీంతో వెంకటాపురం ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.  వివాహం సమయంలో కేసీఆర్, చంద్రబాబు మరోసారి కలవనున్నారని తెలుస్తోంది.