బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 23 మే 2015 (18:02 IST)

జగన్.. నాయక్ కాదు, ఖల్ నాయక్. సోనియా రాక్షసి : కేఈ ఫైర్

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘జగన్‌ నాయక్‌ కాదు... ఖల్‌నాయక్‌' అని, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాక్షసి అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో ప్రధానమంత్రి పదవి వదులుకున్న గొప్ప వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. 
 
కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా శిల్పా చక్రపాణి రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఏనాటికీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. జిల్లా పార్టీ కొత్త అధ్యక్షుడు కర్నూలు నగరంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమైక్య రాష్ట్రాన్ని విభజించిన రాక్షసి సోనియా అని ఆయన ధ్వజమెత్తారు.