బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (17:12 IST)

ఖమ్మం జిల్లాలో దారుణం.. ప్రియురాలిని లారీ కిందకు తోసేసిన ప్రియుడు!

ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని లారీ కిందకు తోసేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ యువతి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఖమ్మం జిల్లా ఇల్లెందులో శుక్రవారం చోటుచేసుకున్న ఈ హఠాత్పరిణామం వివరాలను పరిశీలిస్తే... 
 
శేఖర్, సంధ్య అనే ప్రేమికులు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నారు. ఆ సమయంలో తన ప్రియురాలి భుజంపై చేతులు వేసి వెళుతున్న ప్రియుడు... ఉన్నట్టుండి ఆమెను వేగంగా వస్తున్న లారీ కిందకు తోసి పరారయ్యాడు. లారీ డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో వాహనాన్ని పక్కకు మళ్లించడంతో యువతి ప్రాణాలు మిగిలాయి. తీవ్రగాయాలైన ఆమెను స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. 
 
ప్రస్తుతం ఈ యువతి అపస్మారక స్థితిలో ఉన్నందున, ఘటన వెనక అసలు కథ తెలియడం లేదని పోలీసులు తెలిపారు. కాగా, వీరిద్దరికీ కాలేజీ రోజుల నుంచి పరిచయం ఉన్నట్టు సమాచారం. రోడ్డుపై నడుస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని ఘటనను చూసిన కొందరు స్థానికులు వెల్లడించారు. శేఖర్ పారిపోగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.