మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 5 జూన్ 2017 (13:10 IST)

ఊరకుంటలో శవమై తేలిన ఇద్దరు టీచర్లు.. ఆత్మహత్యా? హత్యా?

ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు యువతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం మస్కాపూర్‌ గ్రామ శివారులోని ఊరకుంటలో ఆదివారం ఆ ఇద్దరు యువతులు శవమై త

ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు యువతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం మస్కాపూర్‌ గ్రామ శివారులోని ఊరకుంటలో ఆదివారం ఆ ఇద్దరు యువతులు శవమై తేలారు.
 
వివరాల్లోకి వెళితే.. ఖానాపూర్ మండల కేంద్రంలోని ఇంద్రానగర్‌ కాలనీకి చెందిన తొంటుకూరి హరీశ(22), కడెం మండలం ఎల్లగడప గ్రామానికి చెందిన కొండవేని హరిత(23) స్నేహితులు. ఈ ఇద్దరు యువతులు ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. 
 
శనివారం వీరిద్దరూ అదృశ్యమయ్యారు.  బంధువులు వారిని వెతికే పనిలో ఉండగానే.. ఆదివారం వారు ఊరకుంటలో మృతదేహాలుగా కనిపించారు. వారిద్దరూ ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదని.. ఇది ముమ్మాటికీ హత్యేనని ఇరువురి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విభిన్న కోణాల్లో విచారణ జరుపుతున్నారు.