మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (19:23 IST)

కిల్లి కృపారాణి భర్తపై కేసు నమోదు.. పోలీసుల అదుపులో రామ్మోహన్ రావు

ఓ మహిళపై దౌర్జన్యం చేశారనే ఆరోపణతో మంగళవారం కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి భర్త రామ్మోహన్ రావుపై పోలీసులపై కేసు నమోదు చేశారు. ఆయన, ఆయన డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
తన పైన రామ్మోహన్ రావు దౌర్జన్యం చేశారని సుగుణ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భీమిలి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది. రంగంలోకి దిగిన పోలీసులు రామ్మోహన్ రావు, అతని డ్రైవర్ పైన కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తన భర్త పైన కేసు నమోదు చేయవద్దని కిల్లి కృపారాణి పోలీసులను అడిగినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం తమ పని తాము చేసి కేసు నమోదు చేశారు.