శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 నవంబరు 2014 (13:58 IST)

కిషన్ రెడ్డి భార్య సంతకం ఫోర్జరీ: రూ.10లక్షలు కాజేయడానికి?

బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి సతీమణి కావ్య సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఓ ప్రబుద్ధుడు అడ్డంగా దొరికిపోయాడు. ఫోర్జరీ చేయడంతో పాటు బ్యాంకుకు వెళ్ళి రూ.10లక్షలు కాజేయడానికి ప్రయత్నించాడు. 
 
హైదరాబాద్ పంజాగుట్టలోని ఆంధ్రాబ్యాంకులో ఉన్న కావ్య అకౌంట్ నుంచి డబ్బు డ్రా చేసుకునే ప్రయత్నం చేస్తుండగా.. బ్యాంక్ మేనేజర్ వెంటనే కిషన్ రెడ్డికి ఫోన్ చేసి చెక్కు గురించి అడిగారు. 
 
ఈ విషయం గురించి కిషన్ రెడ్డి తన భార్యను వాకబు చేయగా.... ఎలాంటి చెక్ తాను ఇవ్వలేదని కావ్య సమాధానం ఇచ్చారు. ఇదే విషయాన్ని బ్యాంక్ మేనేజర్‌కు కిషన్ రెడ్డి తెలిపారు. దీంతో, పోలీసులకు బ్యాంక్ మేనేజర్ సమాచారం అందించగా... వారు వచ్చి దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.