గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 30 జులై 2014 (11:06 IST)

ఇష్టమొచ్చినట్టు పాలిస్తే... తెలంగాణ ప్రభుత్వానికి కోదండరాం వార్నింగ్!

తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏ ఒక్కరు జాగీరు కాదని, ఇష్టమొచ్చినట్టు పరిపాలిస్తే సహించే ప్రసక్తే లేదని ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి ప్రత్యక్ష హెచ్చరికలు చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్రతిఫలాలు తెలంగాణ వాసులకు పూర్తి స్థాయిలో అందాలని కోరారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్లు పరిపాలిస్తే కుదరదని హెచ్చరించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలంతా ప్రస్తుతం నిరాశావాదంలోకి వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.