బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శుక్రవారం, 6 మే 2016 (14:07 IST)

మంత్రి కొల్లు రవీంద్ర కారు బోల్తా...!

గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని కాజ టోల్ గేటు వద్ద మంత్రి  కొల్లు రవీంద్ర కారు(ఏపీ16సీఎం9999) బోల్తా ప‌డింది. కారు తిరుప‌తి నుండి విజ‌య‌వాడ‌కు వ‌స్తున్న‌ప్పుడు ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కారులో మంత్రితో పాటు ఐదుగురు ఉన్నారు. ర‌వీంద్ర క్షేమంగా ఉన్నారు, కారులో ఉన్న  డ్రైవరుకు, మరో ముగ్గురికి  తీవ్ర‌గాయలు అయ్యాయి. వారిని తాడేప‌ల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కార‌ణం డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమేనని పోలీసులు భావిస్తున్నారు.