మంత్రి కొల్లు రవీంద్ర కారు బోల్తా...!
గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని కాజ టోల్ గేటు వద్ద మంత్రి కొల్లు రవీంద్ర కారు(ఏపీ16సీఎం9999) బోల్తా పడింది. కారు తిరుపతి నుండి విజయవాడకు వస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. కారులో మంత్రితో పాటు ఐదుగురు ఉన్నారు. రవీంద్ర క్షేమంగా ఉన్నారు, కారులో ఉన్న డ్రైవరుకు, మరో ముగ్గురికి తీవ్రగాయలు అయ్యాయి. వారిని తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణం డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమేనని పోలీసులు భావిస్తున్నారు.