గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 22 సెప్టెంబరు 2014 (16:12 IST)

చిరంజీవిపై బీజేపీ నేత కృష్ణంరాజు ఘాటైన విమర్శలు!

సినీ నటుడు, కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిపై బీజేపీ నేత, హీరో కృష్ణంరాజు ఘాటైన విమర్శలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆయన సోమవారం మాట్లాడుతూ 100 రోజుల పాలనలో దేశంలో పరిస్థితులు మారిపోవడానికి ఇదేమైనా సినిమానా అని ప్రశ్నించారు. డిపాజిట్లు కూడా దక్కని కాంగ్రెస్ నేతలు, బీజేపీ, టీడీపీలను విమర్శించడం శోచనీయమని ఆయన వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు విశాఖపట్నం జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీతాకు నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ అయింది. చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు సోమవారం ఆమెకు ఈ వారెంట్ జారీ చేసింది. కొత్తపల్లి గీత, విశ్వేశ్వరయ్య ఇన్‌ఫ్రాస్టక్చర్ సంస్థ నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే నిమిత్తం ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో కోర్టు ఈ మేరకు అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది.