కుర్ కురే దొంగలించాడని బాలుడిని స్తంభానికి కట్టేసి చితకబాదాడు.. ఎక్కడ?!
అనంతపురంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కుర్కురే దొంగలించాడని ఓ బాలుడిని ఓ షాపు యజమాని స్తంభానికి కట్టేశాడు. అంతేకాదు.. ఆ బాలుడిని చితకబాదడంతో బాలల హక్కుల సంఘం ఫైర్ అయ్యింది. వివరాల్లోకి వెళితే అనంత తాడిపత్రిలో ఐదు రూపాయల కుర్కురే ప్యాకెట్ను దొంగతనం చేసిన బాలుడుని షాపు యజమాని స్తంభానికి కట్టేశాడు.
భయంతో కేకలు వేసిన ఆ బాలుడి పరిస్థితిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో సంఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు యజమానితో మాట్లాడి బాలుడిని విడిపించారు. ఇదిలా ఉంటే.. ఈ తతంగాన్ని వీడియో తీసిన కొందరు బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో షాపు యజమానిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది.