గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 19 మార్చి 2017 (18:45 IST)

సంతానం కలగలేదని.. భార్యను పుట్టింటికి పంపించి రెండో పెళ్లి చేసుకున్నాడు..

సంతానం కలగడం లేదని భార్యను పుట్టింటికి పంపి రెండో వివాహం చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూల్ జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన పార్వతమ్మ, కల్

సంతానం కలగడం లేదని భార్యను పుట్టింటికి పంపి రెండో వివాహం చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూల్ జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన పార్వతమ్మ, కల్లప్ప దంపతులకు నలుగురు సంతానం. మూడో కుమార్తె సత్యకళను నారాయపుణపురం గ్రామానికి చెందిన వడ్డే రామాంజనేయులుకు ఇచ్చి 2002 జూన్ 16న, వివాహం చేశారు.
 
వీరిది మేనరికం కట్నం కింద కొంత బంగారం కూడా ఇచ్చారు. వీరి వివాహమై 14ఏళ్ళు గడిచినా వీరికి సంతానం కాలేదు. దీంతో మూడేళ్ళ నుండి రామాంజనేయులు భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. అదనపు కట్నం వేధించసాగాడు. 
 
అయితే పక్కా ప్లాన్ ప్రకారం భార్యను పుట్టింటికి పంపి.. నారాయణపురం గ్రామానికి చెందిన ఈరప్ప, పార్వతి దంపతుల కుమార్తె అనితను రెండో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకొన్న సత్యకళ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదనపు కట్నం తేవాలని, లేదా రెండో పెళ్ళికి ఒప్పుకోవాలని ఆమెను వేధించేవాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.