శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 17 ఆగస్టు 2018 (11:37 IST)

పిల్లలకు పెళ్లైంది.. ఇక వద్దని మొత్తుకున్నా.. వినలేదు.. చంపేసింది..

మాజీ ప్రియుడే. కానీ పెళ్లై, పిల్లలు కలిగాక వివాహేతర సంబంధానికి స్వస్తి చెప్పాలనుకుంది ఆ మహిళ. అయితే మాజీ ప్రియుడి వేధింపులు అధికం కావడంతో ఇక చేసేది లేక అతడిని హత్య చేసి పోలీసుల ముందు లొంగిపోయింది. ఈ ఘ

మాజీ ప్రియుడే. కానీ పెళ్లై, పిల్లలు కలిగాక వివాహేతర సంబంధానికి స్వస్తి చెప్పాలనుకుంది ఆ మహిళ. అయితే మాజీ ప్రియుడి వేధింపులు అధికం కావడంతో ఇక చేసేది లేక అతడిని హత్య చేసి పోలీసుల ముందు లొంగిపోయింది. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిడ్జూరు గ్రామానికి చెందిన మహిళ (42) గ్రామంలో కూలీపని చేసుకుని జీవనం సాగిస్తోంది. 
 
ఈమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన గొళ్ల విజయుడుతో ఆ మహిళకు వివాహేతర సంబంధం ఉండేది. తన కుమారుడికి, కుమార్తెకు వివాహమైందని.. ఈ సంబంధానికి స్వస్తి పలికాలని చెప్పినా అతను వినేవాడు కాదు. 
 
తన కోర్కె తీర్చాలంటూ వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమం ఆగస్టు 14వ తేదీన రాత్రి విజయుడు ఆ మహిళ ఇంటికెళ్లిన విజయుడు.. తనతో సంబంధం కొనసాగించాలని ఆమెతో గొడవకు దిగాడు. వీరిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. 
 
కోపంతో ఆ మహిళ రోకలిబండతో విజయుడి తలపై కొట్టింది. అంతేకాదు కత్తితో దాడి చేసింది. ఆపై భయంతో ఇంటికి తాళం వేసి పారిపోయింది. చివరికి బుధవారం సాయంత్రం పోలీసుల ముందు లొంగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.