గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 1 నవంబరు 2014 (13:21 IST)

టీడీపీ కౌన్సిలర్లపై వైసీపీ దాడికి నిరసనగా... నంద్యాలలో బంద్‌

కర్నూలు జిల్లా నంద్యాలలో శనివారం నాడు తెలుగుదేశం పార్టీ బంద్‌కు పిలుపునిచ్చింది. శుక్రవారం నాడు నంద్యాలలో జరిగిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ల‌పై వైసీపీ కౌన్సిలర్లు దాడిచేసి తీవ్రంగా గాయపరచిన సంగతి తెలిసింది. 
 
ఈ నేపథ్యంలో కౌన్సిలర్లపై దాడిని నిరసిస్తూ టీడీపీ పార్టీ నంద్యాల బంద్‌కి పిలుపునిచ్చింది. దీంతో నంద్యాలలోని విద్యా, వ్యాపార సంస్థలు, కార్యాలయాలను శనివారం మూసివేశారు. 
 
కాగా కౌన్సిలర్ల మీద దాడికి సంబంధించి అదే సమావేశంలో వుండి వైసీపీ సభ్యులను దాడికి ప్రేరేపించిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మీద రెండు కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.