శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 12 అక్టోబరు 2015 (12:54 IST)

ప్రత్తిపాటి, గంటాల చరిత్రేంటో తెలుసు.. జగన్ దీక్షను అవమానిస్తారా?

ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీపార్వతి ఫైర్ అయ్యారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గాంధీ మార్గాన్ని జగన్ అనుసరిస్తున్నారని లక్ష్మీపార్వతి తెలిపారు. జగన్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను అవమానిస్తారా? అని ప్రశ్నించారు. మంత్రులు ప్రత్తిపాటి, గరిటాల చరిత్ర ప్రజలకు తెలుసునని చెప్పారు. ఆనాడు పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కావాలని పట్టుబట్టిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు.. ఇప్పుడు ఆ సంగతిని పూర్తిగా మర్చిపోయారని విమర్శించారు.
 
కేంద్రం నుంచి ఏపీకి ఇప్పటి వరకు రూ. 4,200 కోట్లు మాత్రమే వచ్చాయని... తెలంగాణ ప్రభుత్వం మాత్రం రూ. 5,145 కోట్లను సాధించుకుందని తెలిపారు. పనిలో పనిహా ఏపీ సీఎం చంద్రబాబుపై లక్ష్మీపార్వతి మండిపడ్డారు. మోసపూరిత హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. చిన్నవాడైనప్పటికీ రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు, దీక్షలతో జగన్ ముందుకు వెళుతున్నారని అన్నారు.