బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Modified: శనివారం, 20 డిశెంబరు 2014 (12:58 IST)

జగన్ పై ట్విట్ చేసిన నారా లోకేష్..!! ఏమన్నారు?

హుదూద్ బాధితుల కోసం ఖర్చు పెడతానన్న సొమ్ము ఎక్కడ ఖర్చు పెట్టారో జగన్ చెప్పాలని పై టీడీపీ యువనేత నారా లోకేష్ ట్విట్టర్లో ప్రశ్నించారు. హుదూద్ తుపాన్ బాధితుల సహాయార్థం జగన్ రూ. 50 లక్షలు ఇస్తామని గతంలో ప్రకటించారని లోకేష్ అన్నారు. 
 
ఆ డబ్బును ఎప్పుడు ఖర్చు పెట్టారు? ఎక్కడ ఖర్చు పెట్టారో? వెల్లడించాలని డిమాండ్ చేశారు. శాస్త్ర సాంకేతికతను వినియోగించుకుని సోషల్ మీడియాను వాడుకోవడంలో నారా లోకేష్ ముందుంటున్నారు. వైరి పక్ష నేతలైన కేసీఆర్, జగన్ లపై విమర్శలు గుప్పిస్తున్నారు.

తెలంగాణలో తెలుగుదేశం తరపున పాగా వేయాలనుకుంటున్న లోకేష్ కు సోషల్ మీడియాపై మంచి పట్టు ఉంది. అందుకే మోడీ బాటలో నడుస్తూ దొరికిన సాంకేతికతతో వైరి వర్గాలపై విరుచుకుపడుతుంటారు.