శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 28 జులై 2015 (10:36 IST)

నిద్రిస్తున్న వారిపైకి దూసుకొచ్చిన లారీ.. ఇద్దరి మృతి

విజయవాడ రాణిగారితోట సమీపంలో మంగళవారం తెల్లవారుజామున వారిధి వద్ద నిద్రిస్తున్న వారిపై లారీ దూసుకొచ్చింది. ఈ సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఇందులో ఓ చిన్నారి కూడా ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
చేపల లోడుతో బెంజిసర్కిల్ నుంచి లారీ గుంటూరు వైపు వెళ్తోంది. ఈ క్రమంలో హైవే మార్గం అనుకుని డ్రైవర్ వారధికి అనుసంధానంగా ఉన్న వేరొక రూట్ లోకి లారీని తీసుకెళ్లాడు. ముందుకు వెళ్లిన తర్వాత ఆ రూటు హైవేకు వెళ్లేది కాదని ఒక్కసారిగా లారీ ని పక్కకు తిప్పాడు. 
 
దీంతో అక్కడే నిద్రిస్తున్నవారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో కోటేశ్వరమ్మ(55), సుబ్రహ్మణ్యం(6) ప్రాణాలు కోల్పోయారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుందని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.