గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (11:53 IST)

మెదక్ జిల్లాలో రైలు కిందపడి యువ జంట ఆత్మహత్య..!

ప్రేమించుకునే యువతీ యువకుల్లో కొందరు తమ ప్రేమ సఫలం కాకపోతే ఆత్మహత్యలకు పాల్పడటం ఇటీవల తరచుగా జరుగుతోంది. తాజాగా బుధవారం వేకువజామున ఇటువంటి సంఘటన మరొకటి జరిగింది. మెదక్ జిల్లాలో ఓ ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లాలోని తుప్రాన్‌లో మండలం, పడాల్‌పల్లి గ్రామానికి చెందిన మౌనిక(20) స్థానిక ప్రైవేటు డిగ్రీ  కళాశాలలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతుంది. మేడ్చల్ కు చెందిన నగేష్(24) స్తానికంగా ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కలిసి బతకాలని నిర్ణయించుకున్న వీరిద్దరి ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు.
 
దీంతో మనస్థాపానికి గురైన ప్రేమికులు బుధవారం తెల్లవారుజామున గ్రామ సమీపంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి బలవన్మారణానికి పాల్పడ్డారు. ఈ ఘటనను స్తానికలు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి విచారిస్తున్నారు.