శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (17:16 IST)

మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం... బతకనివ్వరు మీరు... అందుకే ఇదే ఆఖరి సెల్ఫీ...

చిత్తూరు జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతో వారు రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు. ఈ ప్రేమ జంట చనిపోయే ముందు సెల్ఫీ తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మొరవపల్లి గ్రామానికి చెందిన రెండు వేర్వేరు కులాలకు చెందిన యువతీ యువకులు ప్రేమించుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ విషయాన్ని పెద్దల వద్ద చెప్పగా, వారు పెళ్లికి అంగీకరించలేదు.
 
దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, చనిపోయే ముందు సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత రైలు కింద పడి చనిపోయారు. ఈ సెల్ఫీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ప్రేమ జంటకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.