బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2017 (12:22 IST)

కట్టుకున్న భర్త నచ్చలేదని, ప్రియుడితో కలిసి ప్రియురాలి ఆత్మహత్య

కట్టుకున్న భర్త నచ్చకపోవడంతో ప్రియుడితో పారిపోయి వచ్చి ఆత్మహత్యకు పాల్పడింది ఓ ప్రియురాలు. తిరుపతిలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రం వరంగల్‌కు చెందిన రంజిత్ కుమార్, వెస్ట్ గోదావర

కట్టుకున్న భర్త నచ్చకపోవడంతో ప్రియుడితో పారిపోయి వచ్చి ఆత్మహత్యకు పాల్పడింది ఓ ప్రియురాలు. తిరుపతిలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రం వరంగల్‌కు చెందిన రంజిత్ కుమార్, వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన మౌనికలు గత నెలలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే మౌనికకు అదే ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తిని ఇచ్చి బలవంతంగా వివాహం చేశారు తల్లిదండ్రులు.
 
పెళ్ళి ఇష్టంలేని మౌనిక భర్తతో తరచూ గొడవలు పడుతూ ఉండేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో నిన్న ఉదయం ప్రియుడు నుంచి మౌనికకు పిలుపువచ్చింది. ఎక్కడికైనా వెళ్ళిపోదామని. దీంతో మౌనిక భర్త ఆఫీసుకు వెళ్ళగానే ప్రియుడితో కలిసి తిరుపతికి పారిపోయి వచ్చింది. 
 
తిరుపతిలోని ఒక ప్రైవేటు హోటల్‌లో గది అద్దెకు తీసుకున్న ప్రేమికుల జంట తమను విడదీస్తారేమోనన్న భయంతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులకు సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి పోస్టు మార్టం నిర్వహించారు. బంధువులకు సమాచారాన్ని అందించారు పోలీసులు.