బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 27 మే 2015 (07:38 IST)

నేటి నుంచి తెలుగుదేశం మహానాడు

తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా ప్రతీ యేడు నిర్వహించే మహానాడు గురువారం నుంచి ప్రారంభం కానున్నది. హైదరాబాద్ లోని గండిపేటలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో చంద్రబాబును టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నుకోనున్నారు.

గండిపేటలో మహానాడు నిర్వహించనున్న ‘తెలుగు విజయం’లో ఏర్పాట్లను పూర్తి చేశారు. మహానాడులో రెండురాష్ట్రాల అంశాలతో పాటు జాతీయ సమస్యల మీద తీర్మానాలపై చర్చ జరిపి ఆమోదించనున్నారు. టి- సర్కారు వైఫల్యాలపైనా చర్చించనున్నారు. లోకేశ్‌కు పార్టీలో సముచిత స్థానం ఇవ్వాలని కోరే అవకాశం ఉంది.

ఆయన చేస్తున్న కృషికి అభినందన తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. మహానాడులో తెలుగుదేశం జాతీయ పార్టీగా అవతరించనుంది. ఈ వేడుకకు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, అండమాన్‌ నికోబార్‌ దీవుల నుంచి కార్యకర్తలు రానున్నారు.