వ్యక్తిని చంపి ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి మూసీ నదిలో పారేశారు!
హైదరాబాద్ నగర శివారు ప్రాంతలో ఓ దారుణం జరిగింది. రాజేంద్రనగర్ పరిధి అత్తాపూర్ సమీపంలో మూసీ కాలువ సమీపంలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. దుండగులు ఓ వ్యక్తిని ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ప్లాస్టిక్
హైదరాబాద్ నగర శివారు ప్రాంతలో ఓ దారుణం జరిగింది. రాజేంద్రనగర్ పరిధి అత్తాపూర్ సమీపంలో మూసీ కాలువ సమీపంలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. దుండగులు ఓ వ్యక్తిని ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి మురికి కాలువలో పడేశారు.
హుతుడి చొక్కాజేబులోని పర్సు ఆధారంగా అతడిని రంగారెడ్డి జిల్లా కుల్కచెర్ల గ్రామానికి చెందిన రవీందర్గా గుర్తించారు. రవీందర్ గత ఐదు సంవత్సరాలుగా పంజాగుట్టలోని జీయో ఆస్పత్రిలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల నుంచి తమ తండ్రి కనిపించడంలేదని రవీందర్ కుమారుడు శేఖర్ పోలీసులకు తెలిపారు.
హతుడికి, అతని తల్లిదండ్రుల మధ్య తరుచూ గొడవలు జరిగేవని.. మద్యం తాగివచ్చి వేధించేవాడని చెప్పాడు. గతంలో స్వగ్రామంలో జరిగిన ఓ హత్యలో రవీందర్ నిందితుడిగా ఉన్నాడని.. పాతకక్షలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.