రెండో పెళ్లి చేసుకుంటా.. విలువైన పార్శిల్ పంపుతున్నా అనగానే? రూ.20లక్షలు ఖాతాలో వేసింది?
తొలి భర్త చిత్రహింసలకు గురిచేశాడు. తొలి భర్త వేధింపులు భరించలేక భార్య విడాకులు తీసుకుంది. తల్లిదండ్రులు రెండో పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టారు. దీంతో వేరేదారి లేక మ్యాట్రిమొనీ వెబ్సైట్లో వరుడి కోసం
తొలి భర్త చిత్రహింసలకు గురిచేశాడు. తొలి భర్త వేధింపులు భరించలేక భార్య విడాకులు తీసుకుంది. తల్లిదండ్రులు రెండో పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టారు. దీంతో వేరేదారి లేక మ్యాట్రిమొనీ వెబ్సైట్లో వరుడి కోసం అన్వేషించింది. రెండో పెళ్లి చేసుకున్నా.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని.. బ్రిటన్లో వ్యాపారవేత్తనని బురిడీ కొట్టించాడు. రాచకొండ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. నాచారానికి చెందిన మహిళ ఓ ప్రముఖ పాఠశాలలో టీచర్. ఏడాది క్రితం ఆమెకు వివాహమైంది. భర్త మందుకు బానిసై చిత్రహింసలు పెట్టేవాడు. దీంతో అతని నుంచి ఆమె విడాకులు తీసుకుంది. రెండో పెళ్లి కోసం మాట్రిమొనీలో తల్లిదండ్రుల ఆలోచన పేరిట అన్వేషించిన టీచర్కు మళ్లీ మోసమే జరిగింది. బ్రిటన్లో వ్యాపారమని పెళ్లి చేసుకుంటానని మ్యాట్రీమొనీ ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. దీంతో ఆ టీచర్ సంతోషపడింది.
నిత్యం ఫేస్ బుక్లో ఛాటింగ్లు.. వాట్సప్లో సందేశాలు.. వెల్లువెత్తాయి. ఒక రోజు ‘మన ప్రేమకు గుర్తుగా నీకు విలువైన పార్శిల్ పంపిస్తున్నా. ఇందుకు కొంత ఛార్జీలు చెల్లించమన్నాడు. బ్యాంకు ఖాతాలు పంపాడు. నిజమని నమ్మిన ఆమె పలు దఫాలుగా రూ.20 లక్షల్ని ఆ వ్యక్తి ఖాతాలో జమచేసింది. ఆ తర్వాత అతడు ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. రోజులు గడుస్తున్నా పార్శిల్ ఇంటికి చేరలేదు. మోసపోయానని లేటుగా గ్రహించిన ఆమె రాచకొండ సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.