ప్రేమ పేరుతో మోసం చేశాడు.. రూ.2లక్షల కట్నం ఇస్తేనే..?
ప్రేమ పేరుతో మోసం చేశాడు. మాయమాటలతో లోబరుచుకుని రూ.2లక్షల కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడు వంచించాడు. వివరాల్లోకి వెళితే.. దాసరి పాలెంకు చెందిన తనకు తండ్రి లేదని.. తల్లి అనారోగ్యంతో మంచాన ప
ప్రేమ పేరుతో మోసం చేశాడు. మాయమాటలతో లోబరుచుకుని రూ.2లక్షల కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడు వంచించాడు. వివరాల్లోకి వెళితే.. దాసరి పాలెంకు చెందిన తనకు తండ్రి లేదని.. తల్లి అనారోగ్యంతో మంచాన పడినట్లు బాధితురాలు తెలిపింది. పెళ్లి చేసుకుంటానంటూ ఓ యువకుడు మోసం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తాను గతంలో గణపవరం స్పిన్నింగ్మిల్లులో పని చేస్తున్నప్పుడు అమలాపురానికి చెందిన దుర్గాప్రసాద్ పరిచయం అయ్యాడు. తనకు మాయమాటలు చెప్పి రెండుసార్లు ఊరుకు తీసుకెళ్లాడన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కానీ పెళ్లి మాటెత్తితే రూ.2లక్షలు కట్నం అడిగినట్లు బాధితురాలు వాపోయింది.