శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 జులై 2014 (11:57 IST)

మెదక్ జిల్లా ఘటన: 12 విద్యార్థులు సేఫ్.. డాక్టర్లు

మెదక్ జిల్లా మాసాయిపేట రైలు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న 12 మంది విద్యార్థులను సాధారణ వార్డుకు మార్చినట్లు యశోద గ్రూప్ హాస్పిటల్ డైరెక్టర్ డా.లింగయ్య వెల్లడించారు. 12 మంది విద్యార్థులను రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని అన్నారు. ప్రశాంతి, వరుణ్‌గౌడ్, వైష్ణవి, తరుణ్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మరో నలుగురు విద్యార్థులు శివకుమార్, నిత్మష, శ్రీవాణి, శరత్ ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. 
 
విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు యశోద వైద్య బృందం ఎప్పటికప్పుడు మెరుగైన వైద్యం అందిస్తోందని చెప్పారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న విద్యార్థులకు ఎలాంటి శస్తచ్రికిత్స అవసరం లేదని వెల్లడించారు. కాగా, విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రిలో ఆందోళనతో ఉన్నారు. తమ బిడ్డ ఆరోగ్యం ఎప్పుడు కుదుటపడుతుందోనని వేచిచూస్తున్నారు.