శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (14:59 IST)

''మా'' గెలుపులో మీడియాదే ప్రధాన పాత్ర: శివాజీ రాజా

''మా'' గెలుపు మీడియాతో ప్రధాన పాత్ర అని నటుడు శివాజీ రాజా అన్నారు. మా కార్యదర్శిగా శివాజీరాజా విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా సహకారం మరవలేనిదని చెప్పారు. గెలిచిన వారందరికీ శివాజీ అభినందనలు తెలియజేశారు. తమ ప్యానల్‌లో నలుగురూ గెలిచారన్నారు. ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తామని శివాజీరాజా స్పష్టం చేశారు. 
 
ఇకపోతే.. ఎన్నికల సందర్భంగా తానిచ్చిన మాటను మర్చిపోవడం అనేది లేదని మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తెలిపాడు. ముందు నిధులు సమీకరిస్తానని, మాకు కార్యాలయం ఏర్పాటు చేస్తానని, అనంతరం బీద సినీ కళాకారులకు ఇన్సూరెన్స్ చేయిస్తానని రాజేంద్రప్రసాద్ భరోసా ఇచ్చాడు. 
 
కొద్దిరోజులు తనపై అభాండాలు వేసినవారిని ఏడవనివ్వమని అన్నాడు. మాలో అర్హులందరికీ సభ్యత్వం కల్పిస్తానని, లక్ష రూపాయల సభ్యత్వంపై అందరితో కూర్చుని చర్చిస్తానని రాజేంద్రప్రసాద్ వెల్లడించాడు.