తిరుమలలో మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం.. కారు అద్దాలు ధ్వంసం
తిరుమలలో మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం సృష్టించాడు. దారిన పోయే వారిపై రాళ్ళు రువ్వి నానాగా హంగామా చేశాడు. దరిదాపులలో ఉన్న వారిపై దాడికి దిగాడు. వివరాలిలా ఉన్నాయి. శేషాద్రి నగర్లో అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఒక వ్యక్తి సోమవారం ఉదయం ఉన్నట్టుల రాళ్ళదాడికి దిగాడు.
వచ్చిపోయే వారిపై దాడి చేయడం మొదలు పెట్టాడు. తీరా ఆ వ్యక్తి మతిస్థిమితం లేని వాడని తేలిపోయింది. వచ్చి పోయే వారి కార్లపై అతడు రాళ్లతో దాడి చేశాడు. ఈ సంఘటనలో ఒక కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. భయాందోళనతో భక్తులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న టీటీడీ సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.