మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (09:44 IST)

కేసీఆర్ చెప్పినట్టు చేస్తున్న జగన్: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినట్లే జగన్ చేస్తున్నారని.. ఆయన డైరక్షన్ చేస్తుంటే జగన్ నడుస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. ఓటుకు నోటు అంశాన్ని కేసీఆర్ చెప్పిన తర్వాతే జగన్ సభలో ప్రస్తావిస్తున్నారనడానికి తమ వద్ద సాక్ష్యముందని అన్నారు.
 
జగన్‌కు ఫోన్ చేసి కేసీఆర్, ఇంకా సభలో ఓటుకు నోటు అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని అడిగినట్టు తమకు తెలిసిందని, అందుకే సమావేశాల చివరి రోజున వైకాపా ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇది మొత్తం రాష్ట్ర ప్రజలకు అవమానకరమని, ప్రజలపై గౌరవముంటే ఇలా చేసేవాళ్లు కాదని వెల్లడించారు.