శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (14:39 IST)

క్షుద్రపూజల పేరుతో బాలికపై గ్యాంగ్ రేప్.. ప్రజా ప్రతినిధి భర్త కూడా..

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఓ దారుణం జరిగింది. క్షుద్రపూజల పేరుతో ఓ బాలికపై వారం రోజుల పాటు సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కామాంధుల్లో ఓ మహిళా ప్రజాప్రతినిధి భర్త కూడా ఉండటం గమనార్హం. తాజాగా

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఓ దారుణం జరిగింది. క్షుద్రపూజల పేరుతో ఓ బాలికపై వారం రోజుల పాటు సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కామాంధుల్లో ఓ మహిళా ప్రజాప్రతినిధి భర్త కూడా ఉండటం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండంలోని అక్కెనపల్లి గ్రామానికి చెందిన ఓ బాలికను అదే గ్రామానికి చెందిన కళమ్మ రెడ్డి అనే మహిళ క్షుద్రపూజల్లో పాల్గొనాల్సిందిగా ఒప్పించింది. ఈ యేడాది జనవరి 29వ, తేదీ నుంచి ఇంటి నుండి బాలికను కళమ్మ రెడ్డి తీసుకెళ్ళింది. మోత్కూరు మండలంలోని అనాజిపురంలో నిజామాబాద్‌కు చెందిన మట్టి వినోద్ కుమార్, రాజు, వినోద్‌లకు బాలికను అప్పగించింది. 
 
అయితే వాళ్ళు ఈ బాలికను అద్దె గదిలోకి తీసుకెళ్ళి పూజలు చేయాలంటూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఒప్పుకోకపోవడంతో మద్యం తాగించి మరీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అలా వారం రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత పూజలు పూర్తయ్యాయని బాలికను ఇంటికి పంపారు. 
 
అయితే ఈ నెల 13వ, తేదీన కళమ్మ రెడ్డి మళ్ళీ బాలికను మభ్యపెట్టింది. ఇప్పుడు వెళ్తే డబ్బులు వస్తాయంటూ తీసుకెళ్ళింది. నెమ్మాని గ్రామానికి చెందిన అలుగుబెల్లి రాజశేఖర్ రెడ్డి ఇంట్లో ఉంచింది. నెమ్మాని ఎంపిటీసి సభ్యురాలి భర్త ఉయ్యా వెంకన్నతో పాటు మరికొందరు వ్యక్తులు బాలికపై ఈ నెల 15వ, తేదీ వరకు అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
అయితే, తండ్రికి అనుమానం వచ్చి బాలికను నిలదీశాడు. దీంతో ఆ బాలిక అసలు విషయాన్ని పూసగుచ్చినట్టు వెల్లడించింది. దీంతో తండ్రి సైదులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసును విచారిస్తున్నారు.