గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (08:57 IST)

తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకటరమణ భార్య!

అనారోగ్యం కారణంగా ఇటీవల కన్నుమూసిన తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటరమణ స్థానంలో ఆయన భార్యకే టిక్కెట్ కేటాయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసిన వెంకటరమణ భార్య సుగుణ సమర్థురాలేనని గురువారం జరిగిన టీడీఎల్పీ భేటీ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో తిరుపతి అసెంబ్లీకి జరిగే ఉప ఎన్నికల్లో సుగుణకు టిక్కెట్ కేటాయించడం ఖాయమైనట్టేనని తిరుపతి టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. 
 
కాగా, అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన వెంకటరమణ, సుగుణ దంపతులకు ఇద్దరు కూతుర్లున్నారు. అయితే వారిద్దరూ బధిరులే కావడంతో తిరుపతి అసెంబ్లీ టికెట్‌ను వెంకటరమణ భార్య సుగుణకే ఇవ్వాలని చంద్రబాబు దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వెంకటరమణ భార్యను రంగంలోకి దించడంతో విపక్షం కూడా అక్కడ అభ్యర్థిని నిలిపే అవకాశాలుండవని కూడా బాబు యోచిస్తున్నారు.