శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: ఆదివారం, 29 మే 2016 (19:58 IST)

నిన్న జ‌గ‌న్... రేపు మోదీ... ఎల్లుండి బిన్ లాడెన్ మా బ్యాకింగ్ అంటారు.. ముద్ర‌గ‌డ‌

హైద‌రాబాద్:  తాను చేస్తున్న కాపు జాతి ఉద్య‌మం వెనుక ఎవ‌రో ఉన్నార‌ని ఆరోప‌ణ‌లు చేయ‌డం సీఎం చంద్ర‌బాబుకు అల‌వాటుగా మారింద‌ని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం విమ‌ర్శించారు. మా ఉద్య‌మం వెనుక జ‌గ‌న్ ఉన్నాడ‌ని ఆరోపిస్తున్నారు... రేపు బీజేపీ, పీఎం న‌రేంద్ర మోదీ బ్యాంక్ గ్రౌండ్ అంటారు. త‌ర్వాత ఓబామా, బిన్ లాడెన్ మా వెన‌క ఉన్నార‌ని కూడా అంటార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. 
 
కాపు రిజ‌ర్వేష‌న్ కోసం తాను చేసిన నిరాహార దీక్ష‌కు మ‌ద్దతు ప‌లికిన నేత‌ల‌కు కృత‌జ్ఞత‌లు తెలిపేందుకు ముద్ర‌గ‌డ హైద‌రాబాదుకు వ‌చ్చారు. ఆయ‌న చిరంజీవి, ఇత‌ర కాపు నేత‌ల‌ను క‌లిశారు. త‌ర్వాత తాను మ‌ళ్ళీ ఉద్య‌మం చేయాల్సి వ‌స్తే, అంద‌రి స‌హ‌కారం కావాల‌ని కోరారు. కాపుల‌కు రిజ్వేష‌న్ క‌ల్పించ‌కుండా చంద్ర‌బాబు... కాపు నేత‌ల‌తో త‌న‌ను తిట్టిస్తూ, ఎదురుదాడికి దిగుతున్నార‌ని ముద్ర‌గ‌డ ఆరోపించారు.