పవన్ గారు.. కాపు ఉద్యమానికి మద్దతివ్వండి ప్లీజ్ : ముద్రగడ
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆదివారం ఉదయం ఫోన్ చేశారు. తాను చేపట్టిన కాపు ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. కాపు ఉద్యమానికి వివిధ రాజకీయ పార్టీ నేతల మద్దతు కూడాగట్టే పనిలో ముద్రగడ పద్మనాభం ఉన్న విషయం తెల్సిందే.
ఇందులోభాగంగా, ఆయన ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రులు దాసరి నారాయణరావు, సినీ నటుడు చిరంజీవి, పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, అనకాపల్లి మాజీ ఎంపీ హర్షకుమార్లను కలిసి మద్దతు కూడగట్టారు.
అలాగే, హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజును ఆదివారం కలిశారు. కాపు గర్జనకు మద్దతిచ్చినందుకు పళ్లంరాజుకు ముద్రగడ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు పళ్లంరాజు ఫోన్ చేసి ముద్రగడ పద్మనాభంతో మాట్లాడించారు. ఈ సందర్బంగా కాపు ఉద్యమానికి మద్దతివ్వాలని పవన్ను ముద్రగడ కోరారు.