బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 3 మార్చి 2015 (13:23 IST)

మీలో ఎవరు కోటీశ్వరుడు నుంచి తప్పుకోనున్న నాగార్జున

మీలో ఎవరు కోటీశ్వరుడు తెలియని టీవీ వీక్షకుడు ఉండరంటే ఆశ్చర్యం లేదేమో.. ఆ ప్రోగ్రాం అంతటి పాపులర్ అయ్యింది. దానికి నాగార్జున యాంకర్‌గా వ్యవహరించడం వలనే అంతటి ప్రాముఖ్యత లభించింది. అయితే నాగార్జున ఆ ప్రొగ్రాం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని నిర్వహకులకు తెలియజేశారు. దీంతో వారు కూడా ఆందోళనలో పడిపోయారు. అసలు ఈ ప్రొగ్రాంను కొనసాగించాలా..! లేదా అనే ఆలోచనలో పడిపోయారు. వివరాలిలా ఉన్నాయి. 
 
నాగార్జున ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు నుంచి తప్పకోవాలని నిర్ణయించడంతో వారు ప్రత్యామ్నాయ యాంకర్ కోసం వెతుకుతున్నారు. మళ్లీ వెండితెరపై అవకాశాలు పెరగడంతో నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మీలో ఎవరు కోటీశ్వరుడు నిర్వహిస్తున్న మా టీవీ వారు ఆందోళనలో పడ్డారు. మరెవరినైనా ఆయన స్థానంలో నిర్వహించినా అంత ఫలితం ఉండదనే నిర్ణయానికి వచ్చేశారు. అందుకే ఏకంగా ఈ ప్రోగ్రాంనే నిలిపేయాలనే ఓ ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నాగార్జునలా షోను నడపగలిగే వ్యక్తిని వెతకడం అంత సులువుకాదని వారు భావిస్తున్నారు. 
 
గతంలో కూడా కౌన్ బనేగా కరోడ్ పతి నుంచి అమితాబ్ అర్ధాంతరంగా తప్పుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు షారూక్ ఖాన్ కు ఆ బాధ్యతలను అప్పగించారు. అయితే కౌన్ బనేగా కరోడ్ పతి అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కూడా మీలో ఎవరు కోటీశ్వరుడూ ప్రోగ్రాంను నిలిపేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, నాగార్జుననే ఒప్పించి షో కొనసాగించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఏమవుతుందో వేచి చూడాల్సిందే.