గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 27 మే 2015 (14:26 IST)

ఏయ్ పోలీస్.. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా... ఖాకీలతో బాలకృష్ణ వాగ్వాదం?

హైదరాబాద్, గండిపేటలో బుధవారం ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ మహానాడులో పోలీసులతో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వాగ్వాదానికి దిగారు. కారును వీఐపీ పార్కింగ్ వద్ద నిలిపేసి మహానాడు ప్రాంగణానికి నడిచి వెళ్లాలని పోలీసులు చేసిన సూచనను ఆయన తోసిపుచ్చి.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 
 
ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా అంటూ గద్దెంచినట్టు అక్కడున్న ఓ పోలీసు అధికారిని బాలకృష్ణ మాట్లాడినట్టు సమాచారం. ఆ తర్వాత పోలీసుల మాటలను ఏమాత్రం లక్ష్యపెట్టక మహానాడు మెయిన్ గేటు వరకూ కారులో వెళ్లారు. 
 
అనంతరం ఆయన మాట్లాడుతూ, అభిమానులు, కార్యకర్తల సంఖ్య అధికంగా ఉండటం, తనకు రక్షణగా ఎక్కువ మంది లేకపోవడంతోనే కారును మెయిన్ గేటు వరకూ తీసుకెళ్తున్నట్టు పోలీసులకు చెప్పానే తప్ప ఎవరినీ తిట్టలేదని అన్నారు.