శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : శనివారం, 28 మే 2016 (15:55 IST)

తిరుపతి మహానాడులో నారాలోకేష్‌ రక్తదానం

తిరుపతి మహానాడులో తెలుగుదేశంపార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు నారాలోకేష్‌ రక్తదానం చేశారు. మహానాడు ప్రాంగణలో ఎన్‌టిఆర్‌ ట్రస్టు పేరుతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరంకు వచ్చిన నారాలోకేష్‌ ముందుగా నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే రక్తదానం చేస్తున్న తెదేపా కార్యకర్తలు, నాయకులను అభినందించి వారికి సర్టిఫికెట్లను అందజేశారు. 
 
ఆ తర్వాత తాను కూడా రక్తదానం చేశారు. దీంతో తెదేపా శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. నారాలోకేష్‌ రక్తదానం చేయకముందు ఖాళీగా ఉన్న శిబిరం లోకేష్‌ రక్తదానం చేసిన వెంటనే కార్యకర్తలతో నిండిపోయింది. పోటీలు పడి మరీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు.