శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 13 అక్టోబరు 2018 (19:22 IST)

మోటారు బైకుపై మంత్రి నారా లోకేష్ పర్యటన... తుఫాన్ బాధిత ప్రాంతాల్లో...

సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కె.రామ్మోహన్ నాయుడుతో కలిసి శనివారం శ్రీకాకుళం జిల్లాలో సంతబొమ్మాలి, కోటబొమ్మాలి, టెక్కలి, నందిగామ మండలాల్లో పర్యటించారు. 
 
తుఫాన్ ప్రభావంతో బాధపడుతున్న బాధితులను ఓదార్చారు. బాధితులను అన్నివిధాలా సహాయసహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. నారా లోకేష్‌ను చూడటానికి సిక్కోలు జిల్లా వాసులు తరలివచ్చారు.