శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (13:13 IST)

ఇష్టమంటారు... కాఫీ తాగి వెళ్లిపోతారు... మోడీగారూ ఏపీకి అది కాస్త ఇద్దురూ...?!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైకి వెలుగులు కనబడుతున్నప్పటికీ లోన అప్పులతో సతమతమవుతుందని ఎన్నోమార్లు ప్రభుత్వ లెక్కలు చెపుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖలో జరుగుతున్న అంతర్జాతీయ నౌకాదళ ప్రదర్శనకు వచ్చారు. విశాఖ సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్ని చూడటమే కాకుండా అరకు నుంచి తెచ్చిన కాఫీ పొడి గింజలతో చేసిన కాఫీకి ఫిదా అయిపోయానని కూడా అన్నారు. ఆ కాఫీ గింజలు ఎక్కడివంటూ వాకబు చేశారు. భలే సంబరపడ్డారు చాలామంది. 
 
ఇక విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ... విశాఖపట్నం అంటే తనకు చాలా ఇష్టమన్నారు. హుధూద్ తుఫాన్ భారీ విపత్తు నుంచి ఈ నగరం చాలా త్వరగా బయటపడిందని, ఇక్కడి ప్రజల ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఐతే ఏపీకి ప్రత్యేక హోదాపై మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు. రాష్ట్ర విభజనతో కుదేలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకుంటానని ఎన్నికల సమయంలో చెప్పిన మోదీ ఆచరణలో చేయడం లేదని ఏపీ ప్రజలు విమర్శిస్తున్నారు. మరి త్వరలోనే హోదా వస్తుందని ఆశిద్దాం.