గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 31 జులై 2014 (14:06 IST)

ఫీజు రీయింబర్స్‌మెంట్.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పారు. తెలంగాణ విద్యార్థులకు బోధనా రుసుము చెల్లించడానికి ప్రభుత్వం 'ఫాస్ట్' పథకంకు రూపకల్పన చేసిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకుని తెలంగాణలో చదివే ఏపీ విద్యార్థుల భారాన్ని పంచుకోవాలన్నారు. 
 
తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో 1956 స్థానికత చేయడం సరికాదని డొక్కా వ్యాఖ్యానించారు. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తే సమస్యల పరిష్కారానికి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. రెండు రాష్ట్రాల నేతలతో అఖిలపక్షం ఏర్పాటు చేసుకోవాలని మాణిక్య వరప్రసాద్ తెలిపారు.