మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 సెప్టెంబరు 2014 (14:16 IST)

నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు పడ్డారు: 30 మందికి పైగా... విలువైన...

మహారాష్ట్రలోని వరదబలాష వద్ద నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో సోమవారం తెల్లవారు జామున దొంగలు భారీగా నగదు, నగలు దోచుకున్నారు. ప్రయాణీకులంతా నిద్రలో ఉండగా తెల్లవారు జామున రెండున్నర గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ తెల్లవారుజామున దోపిడీ జరిగింది. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్లో ఆరో నంబర్ ప్లాట్ ఫాంపై ట్రైన్ ఆగి ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
 
దాదాపు 30మందికి పైగా దొంగలు ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులు దోచుకున్నారు. బాధితులు వెంటనే దోపిడీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రయాణీకులు విజయవాడలో ప్రభుత్వ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.