శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 20 జులై 2014 (16:04 IST)

2020 నాటికి ఏపీలో విద్యుత్ కొరత ఉండదు : వెంకయ్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదుద్దుతామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. ఆదివారం తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చూస్తామన్నారు. 
 
ముఖ్యంగా 2020 నాటికి విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామన్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలకు గత యూపీఏ సర్కారు తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలే కారణమని ఆరోపించారు. తిరుపతి రైల్వే స్టేషన్‌ను త్వరలోనే అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి అభివృద్ధి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు.