శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 25 నవంబరు 2017 (10:27 IST)

కాటేసిన మేనమామ.. గర్భందాల్చిన 16ఏళ్ల బాలిక

విశాఖపట్టణం జిల్లాలో ఓ బాలికను మేనమామ లైంగికంగా వాడుకుంటూ వచ్చాడు. ఈ విషయం తెలిసిన ఆ బాలిక తల్లి.. తప్పురా అని చెప్పాల్సింది పోయి... తమ్ముడికే వత్తాసు పలికింది. ఫలితంగా ఆ బాలిక 16 యేళ్లకే గర్భందాల్చిం

విశాఖపట్టణం జిల్లాలో ఓ బాలికను మేనమామ లైంగికంగా వాడుకుంటూ వచ్చాడు. ఈ విషయం తెలిసిన ఆ బాలిక తల్లి.. తప్పురా అని చెప్పాల్సింది పోయి... తమ్ముడికే వత్తాసు పలికింది. ఫలితంగా ఆ బాలిక 16 యేళ్లకే గర్భందాల్చింది. ఈ విషయం ఇరుగుపొరుగువారి కారణంగా పోలీసులకు తెలిసింది. దీనిపై ఐసీడీఎస్ అధికారులు ఆరా తీస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలం పొట్టిదొరపాలెం గ్రామానికి చెందిన గిడుతూరి చినబాబు, మాణిక్యం దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. మాణిక్యంకు సోమరాజు అనే తమ్ముడు ఉన్నాడు. ఇతనికి ఏడేళ్ల క్రితం యువతితో వివాహం జరుగింది. అయితే, కుటుంబ కారణాల రీత్యా భార్య పుట్టింట్టికి వెళ్లిపోయింది. అప్పటినుంచి అక్క ఇంటే సోమరాజు ఉంటూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో ఎనిమిదో తరగతి చదువుతున్న 16 యేళ్ళ అక్క కుమార్తెపై ఆ కామాంధుడు కన్నేశాడు. అక్క, బావ పనులకు వెళ్లిన సమయంలో ఆ బాలికకు మాయమాటులు చెప్పి లైంగికంగా లోబరుచుకున్నాడు. మేనమామ తనను వేధిస్తున్నాడని తల్లికి చెప్పగా, ఆమె కూడా తమ్ముడినే వెనుకేసుకొచ్చింది. పైగా, కుమార్తె గర్భందాల్చిన విషయం గ్రహించి గుట్టుచప్పుడు కాకుండా ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్‌ కూడా చేయించింది. 
 
ఈనేపథ్యంలో ఆ బాలిక మళ్లీ గర్భందాల్చింది. ప్రస్తుతం ఐదు నెలల గర్భంతో తిరుగుతున్న బాలికను చూసి, స్థానికులు ఐసీడీఎస్‌ అధికారులకు సమచారం చేరవేశారు. దీంతో బాలిక తల్లి, మేనమామను ప్రశ్నించగా, వారు జరిగిన విషయం వెల్లడించారు. ఆ తర్వాత బాలికతో పాటు ఐసీడీఎస్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సోమరాజును అరెస్టు చేశారు. బాలికను భీమునిపట్నంలోని బాలసదన్‌కు తరలించారు.