శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Eswar
Last Modified: బుధవారం, 30 జులై 2014 (22:00 IST)

విశాఖలో మరో పవర్ ప్లాంట్ ప్రారంభం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విస్తరణలో మరో అడుగు ముందుకు వేసింది. ఇండియా, జపాన్‌ సంయుక్త సాంకేతిక పరిజ్ఞానంతో నూతనంగా నిర్మించిన పవర్‌ ప్లాంట్‌ను ప్రారంభించింది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి మోహన్‌ కుమార్ ఈ ప్లాంట్‌ను ప్రారంభించారు.
 
250 కోట్ల రూపాయల పెట్టుబడితో 23 మెగావాట్ల విద్యుత్‌ను ఈ ప్లాంట్‌ ద్వారా ఉత్పత్తి చేయనున్నారు. పర్యావరణ కాలుష్యం లేకుండా ఉక్కు ఉత్పత్తిలో భాగంగా నిరుపయోగమవుతున్నవేడిని తిరిగి ఉపయోగించుకుని ఈ ప్లాంట్‌ విద్యుత్ ను ఉత్పత్తి చేయనుంది.