శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 24 జులై 2014 (11:52 IST)

ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు!

విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల మండలం మెయిడ గ్రామానికి చెందిన ఒక జంట పెళ్ళయిన 30 రోజులకే ఆత్మహత్య చేసుకుంది. ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్న ఈ జంటకి పెళ్ళి చేయడానికి ఇరువైపు పెద్దలు నిరాకరించారు. దాంతో వీరిద్దరూ తమతమ ఇళ్ళలోంచి బయటకి వచ్చేసి పెళ్ళిచేసుకుని కలసి జీవిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో.. వివాహమై నెల రోజులు గడిచినప్పటికీ... రెండు కుటుంబాల పెద్దలు వీరిని క్షమించలేదు కదా తమను ఏ ఒక్కరూ ఇంటికి పిలవక పోవడంతోపాటు.. కనీసం పట్టించుకోక పోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. దీంతో మొదట ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించింది. భార్య మరణించడాన్ని తట్టుకోలేక అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో రెండు కుటుంబాల సభ్యులు ఇపుడు భోరున విలపిస్తున్నారు. పెళ్ళయిన నెలరోజులకే చనిపోయిన వీరిద్దరినీ చూసి అందరూ కంటతడి పెట్టుకుంటున్నారు.