బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : ఆదివారం, 19 ఏప్రియల్ 2015 (12:57 IST)

కోట్లు దండుకున్న జగన్, సీఎంను ఆరోపించడమా.. చినరాజప్ప ఆగ్రహం!

కోట్లాది రూపాయలు దండుకున్న వైకాపా అధినేత, రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడుపై ఆరోపించడమా అంటూ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తంచేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ లక్ష కోట్లు దండుకున్నాడన్నారు. అందువలనే అందరూ తనలాగే దండుకుంటారని ఆయన అనుకుంటున్నాడని చినరాజప్ప ఎధ్దేవా చేశారు. 
 
పట్టిసీమ పేరిట సీఎం నారా చంద్రబాబునాయుడు రూ.300 కోట్ల మేర నిధులను జేబులో వేసుకునేందుకు యత్నిస్తున్నారన్న జగన్ ఆరోపణలపై చినరాజప్ప మండిపడ్డారు. పట్టిసీమతో రాయలసీమకు తాగు, సాగు నీరందుతుందని ఆయన పేర్కొన్నారు. పట్టిసీమ పూర్తయితే జగన్ గల్లంతవుతాడనే భయంతోనే ఆయన సీఎంపై ఆరోపణలు గుప్పిస్తున్నాడని చినరాజప్ప వ్యాఖ్యానించారు.