గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (11:58 IST)

తొలి భేటీకే హ్యాండిచ్చిన చంద్రబాబు... అరవింద్ పనగరియా ఆగ్రహం..

భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త పథకం నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్‌ అరవింద్ పనగరియా హైదరాబాద్ పర్యటకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఏపీ సీఎం డుమ్మాకొట్టడంతో ఆయనపై అరవింద్ పనగరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వివరాల్లోకి వెళితే..  నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అరవింద్ పనగరియా రాష్ట్రాల పర్యటనలో భాగంగా తొలిసారిగా ఏపీ, తెలంగాణలకు వచ్చారు. 
 
పర్యటనలో భాగంగా హైదరాబాదు చేరుకున్న పనగరియా ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశం కావాలని చూడగా, ఆయన కనిపించలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున కిందిస్థాయి అధికారులే పనగరియాతో భేటీకి వచ్చారు. దీంతో కాస్త ఇబ్బందిపడ్డ పనగరియా, తొలి భేటీలోనే చంద్రబాబు తనకు హ్యాండిచ్చారని ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం.