శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 ఫిబ్రవరి 2015 (19:11 IST)

ఎన్నికల్లో గెలవడం కాదు.. మెజార్టీ తెచ్చుకోవడమే ముఖ్యం!

ఎన్నికల్లో గెలవడం కాదు.. అత్యధిక మెజార్టీ తెచ్చుకోవడమే ముఖ్యమని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న చైతన్యరాజు అత్యధిక మెజార్టీతో గెలుపొందేలా చూడాలని సూచించారు.
 
గెలుపు ముఖ్యం కాదని, మెజార్టీయే ప్రధానమని లోకేష్ అన్నారు. ఇటీవల జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధించడంపై నారా లోకేష్ మాట్లాడుతూ.. ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండానే తిరుపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించామన్నారు. కేవలం బూత్ స్థాయి నిర్వహణ ఖర్చులు మాత్రమే పెట్టామని లోకేష్ చెప్పారు.