శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: శనివారం, 28 ఫిబ్రవరి 2015 (13:40 IST)

బాలికపై అఘాయిత్యానికి పూనుకున్న వృద్ధుడు

మద్యం మత్తులో తాను ఏమి చేస్తున్నాడో తనకే తెలియడం లేదు ఆ వృద్ధుడికి. బాలిక అన్న స్పృహ కూడా అతగాడికి లేదు. 64 యేళ్ళ వయస్సులో 4 యేళ్ల బాలికపై అత్యాచారానికి పూనుకున్నాడు. బాలిక అమ్మమ్మ హుషారు కావడంతో బాలికను కాపాడి గుణ శేఖర్ రెడ్డి అనే వృ్ద్దుడిని పోలీసులకు అప్పజెప్పారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
పుత్తూరు పట్టణ పరిధిలోని చెర్లోపల్లిలో నివాసం ఉంటున్న గుణ శేఖర్‌రెడ్డి(64) అనే వృద్ధుడు సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఉన్న బాలిక(4)ను పిలిచి చాక్ లెట్ ఇస్తానని నమ్మబలికాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతడు ఆ బాలికను ఇంటికి పిలుచుకుని వెళ్లాడు. గమనించిన అంగన్‌వాడి ఆయా బాలిక ఇంటి వద్దకు వెళ్లి విచారించింది. విషయాన్ని బాలిక అమ్మమ్మకు చెప్పింది. సమాచారం అందుకున్న ఆమె గుణశేఖర్‌రెడ్డి ఇంటికి వెళ్లింది.
 
మూసివున్న ఇంటి తలుపు తెరవాలని కేకపెట్టింది. అయినా తెరవకపోవడంతో ఆమే తలుపు గడియను ఏదో రకంగా తీసేసింది. అప్పటికే ఆ బాలిక ఒంటిపై దుస్తులులేవు. అఘాయిత్యం చేయబోతున్న అతడి నుంచి మనుమరాలిని విడిపించుకుంది. ఈ దశలో ఆమెపై నిందితుడు దాడి చేశాడు. దీంతో ఆమె అరుపులు కేకలు పెట్టడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని చితకబాదారు. పోలీసులకు అప్పగించారు.