గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 జనవరి 2015 (12:16 IST)

పింఛన్ అడిగిన పాపానికి ముదుసలి చెంప వాచింది!

పింఛన్ అడిగిన పాపానికి ఓ ముదుసలి చెంప వాచిన ఘటన నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. ఆమె ఓ పండు ముదుసలి. ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్‌తో నిశ్చింతగా జీవించొచ్చని భావించింది. 
 
అయితే ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ఆమె పేరు లేదు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధిని ఆశ్రయిస్తే, పింఛన్ అందకపోతుందా, అనుకున్న ఆమెకు ఊహించని విధంగా చెంపదెబ్బ తగిలింది. 
 
వివరాల్లోకెళితే... పట్టణంలోని 21వ వార్డుకు చెందిన వృద్ధురాలు లక్ష్మి, పింఛన్ ఇప్పించాలని తమ వార్డు కౌన్సిలర్‌గా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేత నర్సింలును వేడుకుంది. ముసలమ్మకు సాయం చేయాల్సిన నర్సింలు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు. 
 
వృద్ధురాలి చెంప చెళ్లుమనిపించాడు. దీంతో ఆసరా కోసమొస్తే, చెంపదెబ్బ తగిలిందని రోదించిన లక్ష్మి పోలీస్ స్టేషన్లో నర్సింలుపై ఫిర్యాదు చేసింది.