గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2015 (10:27 IST)

ప్రత్యేక హోదా కావాలి...! నెల్లూరులో వ్యక్తి ఆత్మహత్య...!!

ప్రత్యేక హోదా ఖాతాలోకి మరో బలిదానం జరిగి పోయింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. 
 
నెల్లూరు జిల్లా వేదాయ పాలెంలో లక్ష్మయ్య అనే వ్యక్తి ప్రత్యేక హోదా కోరుతూ, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు గల కారణాలను తెలుపుతూ, ఓ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందులో జై ఆంధ్రప్రదేశ్... జై జై ప్రత్యేక హోదా అనే నినాదాన్ని రాశారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అందులో పేర్కొన్నారు.